నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించడంపై ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నతస్థాయి సమీక్ష

  • పరీక్షను ఆటంకాలు లేకుండా నిర్వహించాలని ఆదేశాలు
  • పరీక్ష నిర్వహణలో సమగ్రత, పారదర్శకత అవసరమన్న కేంద్రమంత్రి
  • పరీక్ష కేంద్రాల వద్ద అప్రమత్తత, భద్రతపై రాజీపడొద్దన్న కేంద్రమంత్రి
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ త్వరలోనే తిరిగి నిర్వహించనున్న నీట్ (యూజీ) పరీక్షపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ పరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష నిర్వహణలో సమగ్రత, పారదర్శకత అవసరాన్ని గుర్తు చేశారు. గత పరీక్షలో గుర్తించిన లోపాలను పరిష్కరించాలని సూచించారు.

మే 3న నీట్ పరీక్ష నిర్వహించగా, పేపర్ లీక్ కారణంగా ఆ పరీక్షను జూన్ 21న తిరిగి నిర్వహించాలని ఎన్టీయే ప్రకటించడం తెలిసిందే. 

ఈ క్రమంలో, నీట్ పరీక్షపై కలెక్టర్లు, ఎస్పీలతో సమన్వయ సమావేశాలు జరపాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద అప్రమత్తత, భద్రతపై రాజీపడవద్దని తెలిపారు.

నీట్ పరీక్ష పత్రం లీక్ కావడంపై సీబీఐ విచారణ జరుగుతున్నట్లు తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారని కేంద్రమంత్రి పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. విద్యార్థులు నష్టపోకూడదనే పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు తమకు మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నారు.



Dharmendra Pradhan
NEET UG Exam
NEET Exam
Exam Re-conduct
CBI Investigation
Exam Paper Leak

More Telugu News